*మాదకద్రవ్యాల వినియోగ నివారణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు*
*• మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని గుర్తించి, వారికి డాక్టర్ల ద్వారా సూచనలు, సలహాలు ఇప్పిటచడం జరిగింది*
— జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ *
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 21
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం (జూన్ 26, 2025)ను పురస్కరించుకుని, కామారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు జూన్ 20 నుండి 26 తేదీల వరకు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
శనివారం రోజున (జూన్ 21), జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో, మాదకద్రవ్యాలు వాడుతున్న వారిని గుర్తించి, వారిని డాక్టర్ల వద్దకు తీసుకెళ్లి, మాదకద్రవ్యాలు ఎలా మానవాళికి హానికరంగా మారుతున్నాయో వివరించి, వాటి అలవాటు నుంచి విముక్తి పొందేందుకు అవసరమైన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు అందించడమైంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, బాధితులను తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చడమే ఈ అవగాహన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం అని ఎస్పీయం. రాజేష్ చంద్ర IPS తెలిపారు.