జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 21

యోగ సాధన – వృత్తిలో వచ్చే వత్తిడిని తగ్గిస్తుంది

యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనం సొంతం

ప్రపంచ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, మొదటగా సిబ్బందికి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అతి చిన్న వయసులోనే రోగాలకు గురవుతూ ప్రమాద పరిస్థితులు నెలకొంటున్న నేటి పరిస్థితుల్లో యోగా, సూర్య నమస్కారాలు, నడక వంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

యోగ అనేది వయసుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధనమని పేర్కొంటూ, యోగా వల్ల, ఆసనాల వల్ల అనారోగ్య బారిన పడకుండా, శారీరక దృఢత్వాన్ని కాపాడుకో వచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసులు రేయింబవళ్లు 24 గంటలు విధులను నిర్వర్తిస్తుంటారని వారికి యోగ ఎంతగానో తోడ్పాటు అందజేస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతూ విధులను నిర్వర్తించాలని సూచించారు. యోగ ప్రాణాయామము ఆసనాలు వలన మానసిక, శరీరక విశ్రాంతి, ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.గుండెకు, శరీరానికి, మనసుకు అన్నిటికీ యోగ ఉత్తమమైన మార్గమని తెలిపారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు పోలీస్టేషనలలో అధికారులు, సిబ్బంది యోగా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. పోలీసు అధికారులు,సిబ్బంది యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ అరగంట,గంట పాటు యోగా చేస్తే చాలా వరకూ అనారోగ్యం పాలుకాకుండా ఒత్తిడి వంటివి లేకుండా ప్రశాంత జీవనం సొంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరపయ్య, సిఐలు శ్రీనివాస్, మురళి, శ్రీధర్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment