రామచంద్రాపురంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్

సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామచంద్రాపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 112 డివిజన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ సింగ్, నరేష్ ముదిరాజ్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఉపవాస దీక్షలు విరమించారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి, వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now