*అంతర్జాతీయ యోగా దినోత్సవం లొ పాల్గొన్న ఎంపీడీవో*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 21
గాంధారి మండల కేంద్రంలో తిమ్మాపూర్ గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ నిర్వహించారు. ఎంపీడీవో రాజేశ్వర్ , ఉపాధి హామీ ఏపీవో మధు, పంచాయతీ కార్యదర్శి , మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎంపీడీవో రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా ఆదరణను చురగొంది. నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇది శారీరక. మానసిక. ఆధ్యాత్మిక శ్రేయస్సు కలిగించే అద్భుతమైన ప్రక్రియ అని తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి పలు సూచనలు తెలపడం జరిగింది.