సంగారెడ్డి, జూలై 6
సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విజయవంతానికి విజయవంతానికి రాజకీయ పార్టీలుుు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజకీయ పార్టీలుు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనకు వారి మద్దతు కోరారు.
జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.
సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 94 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, పట్టణ ప్రాంతాల్లో కూడా మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఈ నెల 24వ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి, ఫారాల నింపడంలో సహాయం చేయడంతో పాటు, స్వీకరించిన ఫారాలను వెంటనే డిజిటైజ్ చేసేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు.
రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లను చురుకుగా వినియోగించుకోవాలని, ఓటర్లకు అవగాహన కల్పించి కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. అలాగే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వాగతిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఈఆర్వోలు, తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.












