సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్):పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్నాథ రథయాత్ర భారతీయ సాంస్కృతిక విలువలు మరియు భక్తి సంప్రదాయాలకు ప్రతీక అని, ఇది సమానత్వం, సామరస్యానికి నిలువెత్తు ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతకు, సాన్నిహిత్యానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
జగన్నాథ రథయాత్రకు పూజలు నిర్వహించిన మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: June 27, 2025 7:19 pm
