రైతులకు గిట్టుబాటు ధరతోనే ధాన్యం కొనుగోలు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్
ప్రశ్న ఆయుధం నవంబర్ 12:
జిల్లా కేంద్రంలోని నర్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేసి, లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని సూచించారు.
తేమశాతం సక్రమంగా పరీక్షించి, ప్రతిరోజూ మండల అధికారులు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ట్యాబ్ ఎంట్రీలు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరను నిర్ధారిస్తూ ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలకు ₹2,389, సాధారణ రకానికి ₹2,369 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడం తో పాటు సన్న రకానికి అదనంగా ₹500 బోనస్ అందజేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.