రోడ్లు అధ్వానంగా మారాయి.. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టండి: టీఆర్ఎస్ నాయకుడు కళ్యాణ్కర్ నర్సింగరావు

మెదక్/గజ్వేల్, జూన్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారై రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని నూతన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ కు 9, 10వ వార్డు ప్రజలు టీఆర్ఎస్ నాయకుడు కళ్యాణ్కర్ నర్సింగ్ రావుతో కలిసి వినతి పత్రం అందించారు. గతంలో మంజూరు అయినా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వర్షం కారణంగా కాలనీ రోడ్లు దుర్భరంగా మారుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణం కొరకు గత ప్రభుత్వం లో నిధులు మంజూరు చేసిన నేటికీ రోడ్లు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోడ్డు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్డు అయినందున సి.సి. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయగలరని, వర్షాకాలం కావడం వల్ల రోడ్డుపైన వర్షపు నీళ్లతో బురద మాయమై మెయింటెనెన్స్ లో బాగు చేయాల్సినటువంటి సిసి రోడ్లను చేయకుండా వదిలేయడం వల్ల సీజనల్ వ్యాధికి ప్రజల గురవుతున్నారని, త్వరగా వార్డులో రోడ్డు పనులు ప్రారంభం చేసి అక్కడక్కడ సరిగా లేని మురికి నీటి కాలువలను కూడా బాగు చేసి కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ రోడ్డు మెయిన్ రోడ్డు నుండి వస్తుండగా పాత కూరగాయల మర్కెట్ వద్ద రోడ్డు వెడల్పు చాలా చిన్నదిగా ఉన్నందున ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. సమస్య పరిష్కారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మనోహర్, ఉప్పల శ్రీనివాస్, నర్సింలు, నాయిని రాములు, శ్రీనివాస్, మల్లారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment