సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన కాలం తన సర్వీసులో ఎంతో కీలకం: తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి

IMG 20250617 205750
సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా తను పనిచేసిన 17 నెల కాలంలో జిల్లా ప్రజలు అధికారులు ఉద్యోగుల సహకారం మరువలేనిదని తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ గా 17 నెలల పాటు పని చేసి ఇటీవల పదోన్నతిపై వెళ్లిన వల్లూరు క్రాంతికి ఉద్యోగుల సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, గెజిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హాజరయ్యారు. ఈ సందర్భంగా టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. తన సర్వీసులో సంగారెడ్డి జిల్లాలో పని చేసిన 17 నెలల కాలం మరువలేనిదని అన్నారు. ఎన్నో సంతోషకరమైన అనుభవాలతో జిల్లా నుండి వెళ్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారుల సహకారంతో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోషల్ ఎకనామిక్ సర్వే, ప్రజా పాలన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లాంటి పథకాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ఉద్యోగులకు, జిల్లా అధికారులకు ఈ సందర్భంగా వల్లూరు క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు. తన సర్వీసులో సంగారెడ్డి జిల్లాను జిల్లా ప్రజలను మరువలేనని అన్నారు. పెద్ద జిల్లా అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం పథకాల అమలులో రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి తనకు సహకరించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వరి ధాన్యం సేకరణలో, భూముల సర్వే లో తలెత్తిన సమస్యలను జిల్లా అధికారుల సహకారంతో సమర్థవంతంగా పరిష్కరించినట్లు క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, సిబ్బంది, పాత్రికేయ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment