మానసిక శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సంపూర్ణ జీవనశైలి యోగ.

మానసిక శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సంపూర్ణ జీవనశైలి యోగ.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 21

ఇట్టి కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ Ch.V.R.R. వరప్రసాద్, ముఖ్య అతిథిగా హాజరై, యోగ అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది మన మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక సంపూర్ణ జీవన శైలి. యోగా ద్వారా మనలో శాంతి, స్థైర్యం, ధైర్యం మరియు మానసిక ఓర్పు ఏర్పడతాయి.

ప్రతిరోజూ కొద్ది సేపు యోగా చేయడం ద్వారా,

👉 మన ఆరోగ్యం మెరుగవుతుంది,

👉 ఒత్తిడి (స్ట్రెస్) తగ్గుతుంది,

👉 పని సామర్థ్యం పెరుగుతుంది,

👉 ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,

ప్రపంచవ్యాప్తంగా శనివారం రోజున యోగా ప్రాముఖ్యత పెరిగినందుకు గర్వించదగ్గ విషయం. మన భారతీయ సంప్రదాయం నుండి ఉద్భవించిన యోగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

ఈ సందర్భంగా మనమందరం సంకల్పించుకుందాం ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు యోగాకు కేటాయించి, ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవాటు చేసుకుందాం.యోగా సాధన వల్ల శరీర ఆరోగ్యం మాత్రమే కాకుండా మనశ్శాంతి, ఒత్తిడి నుంచి విముక్తి కూడా లభిస్తుందని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి, యోగా సాధనలో పాల్గొన్న అందరినీ అభినందిస్తూ, ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటించవచ్చని పిలుపునిచ్చారు. యోగా శిక్షకుడు ప్రశాంత్, వివిధ యోగాసనాలు మరియు ప్రాణాయామాలు ప్రదర్శించారు. ఆయన నేతృత్వంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, మరియు సిబ్బంది యోగా సాధన చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులు: టీ నాగరాణి సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి,ఎస్ సుమలత , సీనియర్ సివిల్ జడ్జి, కామారెడ్డి, దీక్ష , అదనపు జూనియర్ సివిల్ జడ్జి,కామారెడ్డి తో పాటు జిల్లా కోర్ట్ ప్రధాన పరిపాలన అధికారి లక్ష్మి కాంత్, సూపెరింటెండెంట్స్ భుజంగరావు, చంద్రసేన్ రెడ్డి, శ్రీధర్, నాగేంద్ర , బార్ అసోసియేషన్ సభ్యులు సురేందర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్ గౌడ్ ఇతర న్యాయవాదులు శ్యామ్ గోపాల్ రావు, మాయా సురేష్,శ్రీనివాస్ రావు, చిరంజీవి, కోర్టు సిబ్బంది, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, కామారెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment