Site icon PRASHNA AYUDHAM

భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్‌..

IMG 20250508 WA0725

: భూ కేటాయింపులపై ఆమోదం తెలపనున్న కేబినెట్‌.. యుద్ధ వాతావరణంపై చర్చ*

అమరావతి..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు..

అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. మరోవైపు.. తాజాగా జరిగిన 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ, సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదించే అవకాశాలు ఉన్నాయి..

తల్లికి వందనం అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది..

ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు..

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది..

కేబినెట్‌ లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది..

Exit mobile version