మహనీయుల చరిత్ర చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది: టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి

IMG 20250414 155348
సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం డా. బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఆయన చిత్ర పటానికి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ లు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మహనీయుల చరిత్ర చదవాలని, మహనీయుల చరిత్ర వల్ల జ్ఞానం పెరుగుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో అసమానతలను రూపుమాపడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు. మహిళల అభివృద్ధి, సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. అన్ని వర్గాలలో సామాజిక రుగ్మతలను రూపుమాపడని అన్నారు. సామాజిక వివక్ష లేని సమాజమే నిర్మించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా బి.ఆర్.అంబేద్కర్ అంటే ఎనలేని గుర్తింపు ఉందని, ఆయన చేసిన సేవలు ఆయన పోరాటాల వల్ల అనేక అంతరాలు తొలగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు విద్యార్థులు చేసిన సంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, ఎస్సీ ఈడీ కార్పొరేషన్ అధికారి రామాచారి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంజయ్య, ఆర్ డిఓ రవీందర్ రెడ్డి, డి.ఎస్.పి సత్తయ్య గౌడ్, జిల్లా అధికారులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment