విద్యా శాఖ సచివుడు వీడియో కాన్ఫరెన్స్
జిల్లా విద్యా ప్రగతిపై సమీక్ష చేసిన కలెక్టర్, అధికారులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ రెవెన్యూ, విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ సెక్రటరీ పలు ఎజెండా అంశాలపై సమీక్ష జరిపారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీల్లో శుభ్రత, అసురక్షిత నిర్మాణాల తొలగింపు, పెయింటింగ్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమయపాలనలో పెండింగ్లో ఉన్న సివిల్ పనులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించారు.
UDISE డేటా స్థితి, క్లస్టర్ స్థాయి సమావేశాల సమీక్ష, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వల్లా వినియోగం, FLN-AXL, T-STEM ల్యాబ్ల అమలు స్థితిని అధికారులు వివరించారు. లైబ్రరీ గదుల లభ్యత, మధ్యాహ్న భోజనానికి LPG గ్యాస్ కనెక్షన్లు, ఆరోగ్య పరీక్షలు, పోషకాహార తోటలు, AMS మొబైల్ యాప్ వినియోగం, వంటగది పరికరాల సేకరణ, ఆహార నమూనా పరీక్షల పరిస్థితులపై కూడా సమీక్ష జరిగింది.
అలాగే KGBVలు, మోడల్ స్కూళ్లలో ఖాళీ సీట్ల స్థితి, పిల్లల భద్రత, సంఘటనల నివేదికలు, SSC & ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం, గత సంవత్సరం నమోదు, హాజరు, ఉత్తీర్ణత వివరాలను పరిశీలించారు. జిల్లాల వారీగా పనితీరు విశ్లేషించి, పెండింగ్లో ఉన్న అంశాలను వేగంగా పూర్తి చేయాలని కార్యదర్శి సూచించారు.