సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఇతర వ్యక్తులను గానికి, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాద్యమాలలో పోస్టులు పేటిన చట్ట రిత్య కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: December 1, 2025 4:05 pm